భారతదేశం, ఆగస్టు 24 -- తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా 'తెలంగాణ రైజింగ్ 2047' నినాదంతో తలపెట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పర్యటనను అడ్డుకోవడం వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి జరిగిన పరాభవం కాదని, ఇది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఘోరంగా అవమానించడమేనని దుయ్యబట్టారు.

గతంలో వైబ్రెంట్ గుజరాత్ పేరుతో గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికాలో 8 రోజుల పాటు పర్యటించి ర్యాలీలు నిర్వహించడానికి విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చిందని, మరి తెలంగాణ సీఎం పర్యటనకు వచ్చేసరికి ఎందుకు అడ్డుకున్నారో కేంద్ర ప్రభుత్వం సమా...