భారతదేశం, జూన్ 18 -- రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఎప్పుడు పుంజుకుంటాయా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సాధారణ ప్రజలకు, రైతు లోకానికి భారత వాతావరణ శాఖ పెద్ద ఊరటనిచ్చే వార్త చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా జూన్ 23 (మంగళవారం) నుండి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదలనున్నట్లు న్యూఢిల్లీలోని ఐఎండీ తెలిపింది.

జూన్ 23 నాటికి నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ వాతావరణ బులిటెన్‌లో పేర్కొంది.

ఐఎండీ న్యూఢిల్లీ తాజా బులిటెన్ల ప్రకారం.. రుతుపవనాలు తిరిగి పుంజుకోవడానికి, రాబోయే 4 నుండి 5 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ప్రస్తుతం రుతుపవనాల ఉత్తర పరిమితి హైదరాబాద్, భద్రాచలం పరిసరాల్లో...