భారతదేశం, ఏప్రిల్ 30 -- అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇరాన్ అణు కార్యక్రమాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద విధించిన నౌకా దిగ్బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తివేసే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుండబద్ధలు కొట్టారు. తమ షరతులకు లోబడి కొత్త అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు ఈ ఒత్తిడి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్‌ను దారికి తెచ్చుకోవడానికి సైనిక దాడుల కంటే నౌకా దిగ్బంధమే సరైన మార్గమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆక్సియోస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ ప్రస్తుత పరిస్థితిని చాలా ఘాటు పదజాలంతో వివరించారు.

"బాంబు దాడుల కంటే ఈ దిగ్బంధం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తోంది. ఇరాన్ ఇప్పుడు ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది...