భారతదేశం, ఆగస్టు 9 -- ఆంధ్రప్రదేశ్‌లో పాము కాటు మరణాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన వినూత్న పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. బాధితులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు 108 అంబులెన్సుల్లోనే 'యాంటీ స్నేక్ వెనమ్' (ASV) టీకాలను అందుబాటులో ఉంచారు. మంగళగిరిలోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ వైద్యుల పర్యవేక్షణలో అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఈ ఇంజెక్షన్‌ను బాధితులకు అందిస్తారు.

పాము కాటుకు గురైన బాధితుడికి అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్‌లోనే ప్రాణరక్షణ చికిత్స అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. జూన్ 2025 నుండి ఇప్పటివరకు పాము కాటుకు సంబంధించి 108 నంబర్‌కు ఏకంగా 3,104 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే కడప, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన ముగ్గురు బాధితులకు అంబులెన్స్‌లోనే ఏఎస్...