భారతదేశం, ఆగస్టు 9 -- వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సొంత అజెండా తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలతో పని లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలో లేనప్పుడు ప్రజల్లోకి వస్తూ పాదయాత్రల పేరిట హామీలు ఇస్తారని, తీరా అధికారంలోకి వచ్చాక అంతఃపురం దాటి బయటకు రారని కామినేని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి మంచి పనికి, అభివృద్ధి కార్యక్రమాలకు తనదే క్రెడిట్ అని చెప్పుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని కామినేని విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను కూడా తానే తెచ్చానని చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.

మెరిట్ సాధించి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన 16 వేల మందికి అవమానం జరిగేలా జగన్ అభూత కల్పనలతో ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులే దీనిపై అనవస...