భారతదేశం, మార్చి 10 -- కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రాష్ట్రంలో పర్యటిస్తోంది. ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలతో కూడిన బృందం సోమవారం కోల్‌కతాలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పర్యటన ముగించుకున్న ఈసీ బృందానికి, పశ్చిమ బెంగాల్ చివరి పర్యటన.

సాధారణంగా ఎన్నికల సంఘం ఏదైనా రాష్ట్రంలో క్షేత్రస్థాయి సమీక్ష పూర్తి చేసిన ఒకటి రెండు రోజుల్లోనే షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఈసీ బృందం మార్చి 10న బెంగాల్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది. కాబట్టి, మార్చి 10 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల తేదీలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

స...