భారతదేశం, మార్చి 24 -- పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయకుండా కేంద్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతినడం, ధరలు పెరగడం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యాచరణ ప్రకటించారు. దీని కోసం ఏడు ప్రత్యేక సాధికార బృందాలను (Empowered Groups) ఏర్పాటు చేసినట్లు ఆయన రాజ్యసభలో వెల్లడించారు.

గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను ఏ విధంగానైతే సాధికార బృందాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయో, ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి కూడా అదే తరహా వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది.

"సరఫరా గొలుసు (Supply Chain), పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై ఈ బృందాలు నిరంతరం పనిచేస్తాయి. స్వల్పకాలిక మరియు ...