భారతదేశం, సెప్టెంబర్ 9 -- అమెరికాలో ఉద్యోగం చేయాలనే లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణుల కలలపై ట్రంప్ సర్కార్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. విదేశీ ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడంపై ట్రంప్ యంత్రాంగం కొత్తగా విధించిన 100,000 డాలర్ల (సుమారు రూ.95 లక్షలు) భారీ ఫీజు నిర్ణయం ఐటీ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ భారం తట్టుకోలేక ఏటా నిర్వహించే హెచ్-1బీ వీసా లాటరీలో పాల్గొనేందుకు ఐటీ దిగ్గజాలు వెనకడుగు వేస్తున్నాయి. ప్రధాన కంపెనీలు తమ దరఖాస్తులను ఏకంగా 85 శాతం నుంచి 100 శాతం వరకు ఉపసంహరించుకోవడం గమనార్హం.

అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్​ఎస్) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. హెచ్​-1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడంతో మనదేశానికి చెందిన ప్రముఖ ఐటీ సేవలు కన్సల్టింగ్ సంస్థలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి.

కొత్త ఫీజుల భ...