భారతదేశం, జనవరి 25 -- 2026కి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల లిస్ట్‌ను విడుదల చేసింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్‌, 113మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు.

తెలంగాణకు చెందిన రామ రెడ్డి మామిడి.. పశు పోషణ, పాడి రంగంలో చేసిన విశేష సేవలకు పద్మశ్రీ పురస్కారం లభించింది. పశు పోషణ, పాడి రంగంలో సహకార సంస్థల ఆధారిత వృద్ధికి ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. సహ వికాస సంస్థ స్థాపకుడిగా రామ రెడ్డి మామిడి.. సహకార సంస్థలను ఏర్పాటు చేసి చాలా మందికి జీవనోపాధిని మెరుగుపరిచారు. పశుపోషణ, పాడి నిర్వహణ, ఆర్థిక పరిపాలన అంశాల్లో రైతులకు శిక్షణ అందించారు. మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను ప్రోత్సహిస్తూ, దూరదృష్టి కలిగిన వ...