భారతదేశం, ఫిబ్రవరి 23 -- టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి గురించి వస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. విజయ్, రష్మిక ఫిబ్రవరి 26, 2026న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ధృవీకరణ నిన్న (ఫిబ్రవరి 22) రాత్రే వచ్చేసింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లికోసం భారీ డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంచుకున్నారు. అందుకోసం వారు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ను వేదికగా సెలెక్ట్ చేసుకున్నారు. ఉదయ్‌పూర్ నగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో అరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ ఏకాయా' (ITC Mementos) రిసార్ట్‌లో రష్మిక, విజయ్ పెళ్లి వేడుక అత్యంత వైభవంగా జరగనుంది.

ప్రకృతి ఒడిలో, పచ్చని కొండలు, నీలి ఆకాశం సాక్షిగా సాగే ఈ రిసార్ట్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఉదయ్‌పూర్‌లోని రద్దీగా ఉండే కోటలు, సరస్సులక...