భారతదేశం, ఆగస్టు 27 -- పండుగల సీజన్ దగ్గరపడుతున్న వేళ సామాన్యుడిపై ధరల భారం పడింది. గత నెలలో కిలో Rs.45 ఉన్న చక్కెర ధర ఒక్కసారిగా పెరిగి ఆగస్టు 26 నాటికి Rs.65కు చేరుకుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం ఏడాది వ్యవధిలోనే చక్కెర ధరలు ఏకంగా 41 శాతం పైగా ప్రియమయ్యాయి. పండుగల సమయంలో వినియోగం సాధారణంగానే ఎక్కువగా ఉండే వేళ, ఈ సడన్ షాక్‌కు కారణమేంటి? పంట దిగుబడి తగ్గడమా? లేదా ఇథనాల్ తయారీకి చెరకును దారి మళ్లించడమా? మార్కెట్ వర్గాల కథనం ప్రకారం అసలు కారణాలను పరిశీలిద్దాం.

2023-24, 2024-25 సీజన్లలో వాతావరణ మార్పులు, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గడం ప్రతికూల ప్రభావం చూపింది. చెరకు పంట ఉత్పత్తి అక్టోబర్ నుంచి మరుసటి ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. క్రితం ఏడాది ఉత్తరప్రదేశ్‌లో చెరకు పంటకు రెడ్ రాట్ (ఎర్ర కుళ్ళు) తెగులు సోకడం, మహారాష్ట్...