భారతదేశం, జూన్ 11 -- పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు చివరకు భారతీయ నావికుల ప్రాణాల మీదకు తెచ్చాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయ నావికులు మరణించగా, ఒకరు అదృశ్యమైనట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) ధృవీకరించింది.

ఈ ఘటనకు సంబంధించి ముంబైలో FSUI జనరల్ సెక్రటరీ మనోజ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, సదరు నౌకతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయిందని, వివరాలను సేకరించడం కష్టంగా మారిందని తెలిపారు. "మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఇద్దరు నావికులు ప్రాణాలు కోల్పోయారు. నౌకకు చీఫ్ ఇంజనీర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి కనిపించడం లేదు" అని ఆయన పేర్కొన్నారు. బాధిత నావికులు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని ఆయన వెల్లడించారు.

ఈ దాడిపై మనోజ...