భారతదేశం, జూన్ 30 -- విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేసి డిగ్రీలు పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలను, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మందికి బంగారు పతకాలను అందజేశారు. ఈ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు.

పట్టభద్రులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'నేను కూడా ఒక మారుమూల గిరిజన గ్రామం నుండి చదువుకుని వచ్చిన మొదటి గ్రాడ్యుయేట్‌ను. ఈ రోజు ఇంతమంది గిరిజన, గ్రామీణ యువత ఉన్నత విద్యను పూర్తి చేసుకుని డిగ్రీలు అందుకోవడం చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది.' అని ఆమె పేర్కొన్నారు.

నవభారత, వికాసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యావంతులైన యువత పాత్ర అత్యంత కీలకమని రాష్ట్రపతి నొక్కిచె...