భారతదేశం, జూలై 26 -- ఆదివారం వచ్చిందంటే చాలు భక్తులు భక్తిశ్రద్ధలతో శివారాధనకు సిద్ధమవుతారు. ఈ ఏడాది జూలై చివరి ప్రదోష వ్రతం అత్యంత పవిత్రమైన ఆదివారమే రావడం విశేషం. ఆదివారం నాడు వచ్చే ఈ ప్రదోష వ్రతాన్ని 'రవి ప్రదోష వ్రతం' అని పిలుస్తారు. ఆషాడ మాసంలో వచ్చే ఈ వ్రతాలకు ప్రత్యేకమైన శక్తి ఉందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన భోళా శంకరుడిని పూజించి, ప్రదోష కథను పఠించడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.

పురాణాల ప్రకారం, ఒకానొక గ్రామంలో అత్యంత నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణుడి భార్య పరమ శివభక్తురాలు. ఎంతో నిష్టతో ఆమె క్రమం తప్పకుండా ప్రదోష వ్రతాలను ఆచరించేది. ఆ దంపతులకు ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. ఒకరోజు ఆ బాలుడు ఎవరికి చెప్పకుండా గంగా స్నానం కోసం ఒంటరిగా బయలుదేరాడు.

దారిలో కొందరు ఆ...