భారతదేశం, ఏప్రిల్ 7 -- అగ్రరాజ్యం అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై యుద్ధాన్ని తారస్థాయికి తీసుకెళ్లాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చమురు నిల్వలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున భీకర దాడులు జరిగాయి. ఈ దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. "ఈ రాత్రితో ఒక పూర్తి నాగరికత అంతం కాబోతోంది. అది మళ్ళీ తిరిగి రాదు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అది జరగవచ్చు" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా సంచలన హెచ్చరిక చేశారు.

హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరవాలని, శాంతి చర్చలకు రావాలని ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ దాడులు జరగడం గమనార్హం. గత 47 ఏళ్లుగా సాగుతున్న "దోపిడీ, అవినీతి, మరణాలకు" ...