భారతదేశం, జూలై 15 -- ఈరోజు నుంచి ఆషాఢ మాసం మొదలైంది. ప్రతి ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సమయంలో వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈసారి వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి? తేదీలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వారాహి దేవి సప్తమాతృకలలో ఒకరుగా చెప్పబడుతుంది. ఆమె శక్తి స్వరూపిణి, శత్రుసంహారిణి, భక్తులను కాపాడే దైవంగా ఆరాధించబడుతుంది. వారాహి దేవికి లలితా త్రిపురసుందరీ దేవి సేనాధిపతిగా కూడా ప్రత్యేక స్థానం ఉంది.

వారాహి నవరాత్రులు జూలై 15, బుధవారం (ఈరోజు) నుంచి ప్రారంభమై, జూలై 23, గురువారం వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రో...