భారతదేశం, జూన్ 15 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలన్నింటిలోనూ రాజుగా పరిగణించే సూర్యభగవానుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. ఈ క్రమంలో జూన్ 15, సోమవారం నాడు సూర్యుడు మిథున రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. జులై 14 వరకు ఆయన ఇదే రాశిలో సంచరిస్తారు. ఈ గోచారం 12 రాశుల వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశిలోకి సూర్యుడి ప్రవేశం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటంతో పాటు సామాజిక గౌరవం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ జాబితాలో ప్రధానంగా ఉన్న నాలుగు రాశులు:

మేష రాశి: వీరికి ఉన్న పట్టుదల, పరాక్రమం మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపు...