భారతదేశం, జూన్ 23 -- ఏపీలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సర్వమత సామరస్య వేడుక నెల్లూరు 'రొట్టెల పండుగ-2026'కు సర్వం సిద్ధమవుతోంది. నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గా వేదికగా జూన్ 26 నుంచి నాలుగు రోజుల పాటు ఈ వార్షిక మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పండుగకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 14 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలోని ఉత్సవ కమిటీ ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీరు, వసతి సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.

భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ ...