భారతదేశం, జూలై 23 -- న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అక్రమాల కారణంగా మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించేందుకు, నిరసన తెలుపుతున్న యువతకు అండగా నిలిచేందుకు 'ఇండియా' కూటమి నేతలు వీధిపోరాటానికి దిగారు. గురువారం రోజున ఢిల్లీలోని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో అత్యవసరంగా సమావేశమైన విపక్ష ఎంపీలు, అక్కడి నుంచి గాంధీ స్మృతి (తీస్ జనవరి మార్గ్) వైపు భారీ ప్రదర్శనగా తరలివెళ్లారు.

ఈ ప్రదర్శనను నిరోధించేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో యత్నించారు. రాహుల్ గాంధీ నివాసమున్న సునెహ్రీ బాగ్ రోడ్డులో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొదట వీటిని దాటుకుని ముందుకు సాగిన ఎంపీలను, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాస ప్రాంత సమీపంలో పోలీసులు మళ్లీ నిలిపివేశారు.

ఆ...