భారతదేశం, ఏప్రిల్ 14 -- భారత రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు దక్షిణాది వర్సెస్ ఉత్తరాది పోరుగా మారుతోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో పారదర్శకత లేదని, ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యాన్ని దెబ్బతీసే కుట్ర అని వారు ఆరోపించారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. "తమిళనాడు ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఏ చిన్న ప్రయత్నం చేసినా రాష్ట్రం స్తంభించిపోతుంది. ప్రతి కుటుంబం వీధిలోకి వచ్చి పోరాడుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నందున కేంద్రం ఈ అంశాన్ని గుట్టుచప...