భారతదేశం, మార్చి 4 -- బిహార్ రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలే నిజం కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది.

ప్రస్తుతం పాట్నాలో జనతాదళ్ (యునైటెడ్) అగ్రనేతల అత్యవసర సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో సంజయ్ ఝా, రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) వంటి పార్టీ కీలక నేతలు పాల్గొంటున్నారు. బిహార్‌లో ఖాళీగా ఉన్న ఐదు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ సమావేశంలో నితీశ్ కుమార్ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగిత...