భారతదేశం, ఏప్రిల్ 14 -- నేటి వేగవంతమైన జీవనశైలిలో సోషల్ మీడియా వాడకం పెరిగింది. మనం చేసే ప్రతి చిన్న పనిని, కొనే వస్తువులను ప్రపంచానికి చూపిస్తున్నాం. ఈ క్రమంలో ఇతరుల అసూయ లేదా ప్రతికూల ఆలోచనలు మనపై పడే అవకాశం ఉందని సంప్రదాయ వాదులు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు జరిగినప్పుడు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పుడు ఈ చర్చ ఎక్కువగా వస్తుంది. మానసిక శాస్త్రం ప్రకారం దీనిని నెగటివ్ ఎనర్జీగా పిలిస్తే, మన సంప్రదాయం దీనిని 'నర దిష్టి'గా అభివర్ణిస్తుంది. ఈ కాలంలో కూడా చాలా మంది తమ మానసిక ప్రశాంతత కోసం, ఇంటి క్షేమం కోసం ఈ దిష్టి నివారణ మార్గాలను అన్వేషిస్తున్నారు.

నర దిష్టి అంటే ఇతరుల చూపు వల్ల కలిగే దోషం అని అర్థం. "నరుడి కంటికి నల్ల రాయి అయినా పగులుతుంది" అనే సామెత తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి. అంటే ఒక వ్యక్తి ఎదుగుదల చూ...