భారతదేశం, జూన్ 17 -- రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్, నరసాపురం యార్డ్‌లో కీలకమైన సిగ్నలింగ్, మౌలిక సదుపాయాల ఆధునీకరణ పనులను చేపట్టనుంది. ఈ అభివృద్ధి పనుల కారణంగా జూన్ 18, 19వ తేదీల్లో పలు రైలు సర్వీసులలో మార్పులు ఉంటాయని రైల్వే శాఖ అధికారిక ప్రటన విడుదల చేసింది.

జూన్ 18న ఉదయం 11:30 గంటల నుండి 24 గంటల డిస్‌కనెక్ట్, జూన్ 19న రెండు గంటల ట్రాఫిక్ బ్లాక్ విధించనున్నారు. దీనివల్ల విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నిడదవోలు, నరసాపురం మార్గాల్లో నడిచే పలు రైళ్లు పాక్షికంగా రద్దవ్వడమే కాకుండా, పాలకొల్లు, భీమవరం జంక్షన్ స్టేషన్ల నుంచే షార్ట్ టెర్మినేట్ (ముందే నిలిపివేయడం) లేదా ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

రైలు నెం. 67243, 67280 (నిడదవోలు - నరసాపురం) జూన్ 18, 19 తేదీల్లో పాలకొల్లు వద్దే నిల...