భారతదేశం, ఆగస్టు 20 -- అమరావతి: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం వద్ద గల ప్రసిద్ధ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. బుధవారం ఉదయం నాటికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఏకంగా 7.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఇదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రాఖర్ జైన్ ఈ విషయాలను వెల్లడించారు. గోదావరితో పాటు కృష్ణ నదిలో కూడా వరద ప్రవాహాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం 42.2 అడుగులకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే, కృష్ణా నదిపై ఉన్న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని జైన్ తెలిపారు. ఇక్కడ వరద ప్రవాహం, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.