భారతదేశం, జనవరి 25 -- 2026 పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాబితాలో 19 మంది మహిళా పురస్కార గ్రహీతలు, ఆరుగురు విదేశీయులు లేదా భారతీయ సంతతికి చెందినవారు, 16 మంది మరణానంతరం పురస్కారాలు అందుకున్నారు ఉన్నారు. ఈ అవార్డులు కళ, ప్రజా వ్యవహారాలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సైన్స్, ఇంజనీరింగ్, సామాజిక సేవ, సివిల్ సర్వీస్, వాణిజ్యం పరిశ్రమ వంటి విభిన్న రంగాల్లో సేవలు చేసిన వాళ్లకు దక్కాయి.

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ దక్కింది. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం లభించింది. గతేడాది చివర్లో ధర్మేంద్ర అనారోగ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. మరోవైపు మలయాళ స్టార్ మమ్ముట్టిని పద్మభూషణ్ పురస్కారం వరించింది.

భారతీయ సినిమా, సంగీతానికి చేసిన సేవలకు గాను సీనియర్ నటుడు ధర్మేంద్ర, దిగ్గజ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్, మలయాళ సి...