భారతదేశం, ఆగస్టు 26 -- ఆపద సమయంలో ఆదుకునేది ధనమేనని ఆచార్య చాణక్యుడు తెలిపారు. డబ్బును ఎలా దాచుకోవాలి, ఎక్కడ వినియోగించాలి, అధర్మంగా సంపాదించిన ధనం ఎంతకాలం నిలుస్తుందనే విషయాలపై ఆయన చెప్పిన అమూల్యమైన సూత్రాలు నేటికీ ఎంతో ప్రయోజనకరం.

ఆచార్య చాణక్యుడిని భారతీయ చరిత్రలో అత్య గొప్ప దూరదృష్టి గల రాజకీయ వేత్తగా, రాజనీతిజ్ఞుడిగా కొలుస్తారు. తన అసాధారణ రాజకీయ చతురతతో సామాన్య బాలుడైన చంద్రగుప్తుడిని మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. శతాబ్దాలు గడిచినా చాణక్య నీతులు అందించిన మార్గదర్శకత్వం నేటి ఆధునిక సమాజానికి కూడా శిరోధార్యమే. మనిషి జీవితంలో ఆర్థిక స్థిరత్వం, ధన సంపాదన, దాని రక్షణ గురించి చాణక్యుడు స్పష్టమైన మార్గాలను నిర్దేశించారు. సంపదను సక్రమంగా నిర్వహించడమే మానవుడికి నిజమైన సురక్షిత భవిష్యత్తును ఇస్తుందని ఆయన నొక్కిచెప...