భారతదేశం, మార్చి 6 -- టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సముద్ర ఖని. అలాగే, తెలుగులో మంచి క్రేజ్ ఉన్న స్టార్ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. వీరిద్దరి కలియకలో, కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కార్మేని సెల్వం.

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా నిర్మించిన ఈ కార్మేని సెల్వం సినిమాను తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా రూపొందించారు. ఈ సినిమాకు రామ్ చక్రి దర్శకత్వంలో వహించారు. విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించగా.. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

కార్మేని సెల్వం సినిమాలో సముద్ర ఖని, గౌతమ్ మీనన్‌తోపాటు లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన...