భారతదేశం, జూలై 18 -- చిక్కబళ్లాపూర్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, దేశ పురోగతికి బాటలు వేసేలా ఉండాలని 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సు కోసం కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ముద్దేనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన 'సీఎస్‌ఆర్ సదస్సు-2026' ముగింపు వేడుకల్లో గురువారం ఆయన అనుగ్రహ భాషణం చేశారు. భారతీయ నాగరికత ఎప్పుడూ ప్రేమ, సేవ, మానవీయ విలువలపైనే ఆధారపడి ఉందన్నారు. ఈ విలువలను రాబోయే తరాలకు అందించడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, కార్పొరేట్ రంగాలు, సమాజం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక పునాది ఉన్న భారతదేశంలో పారదర్శకత, ఉత్తమ పా...