భారతదేశం, సెప్టెంబర్ 4 -- హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని పునరుద్ఘాటించారు. గతంలో రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినా వారెవరూ ఈ ప్రాంతానికి రాలేదని, మీ గుండెల్లో స్థానం పొందడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా ఓవైసీ సోదరులను ఉద్దేశించి. ప్రశంసలు కురిపించారు,దేశభక్తి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వారిద్దరూ ఏమీ తక్కువ కాదని సీఎం వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మించిన వంతెన (చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ ఫ్లైఓవర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ సోదరులు దేశానికి వ్యతిరేకం అంటూ కొందరు చేస్తున్న విమర్శలను తాను తీవ్రంగా ఖండిస్తున్న...