భారతదేశం, మార్చి 2 -- లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలలోని హరిత రిసార్ట్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులకు శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌తో కలిసి ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల శిక్షణా కార్యక్రమం చివరి సెషన్‌లో పాల్గొనడానికి కాంగ్రెస్ అగ్రనేత వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టడం గురించి మాట్లాడారు. దేశం కోసం ప్రధాని బాధ్యతను మోయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్న...