భారతదేశం, జూలై 13 -- ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.

దేవశయని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సకల శుభాలు కలుగుతాయి. దేవశయని ఏకాదశిని హరిశయని ఏకాదశి అని కూడా అంటారు.

ధర్మశాస్త్రాల ప్రకారం, ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు విష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలల పాటు యోగనిద్రను ఉపక్రమిస్తారు. ఆ రోజు నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉండే కాలాన్ని చాతుర్మాస్య వ్రత కాలం అంటారు.

ఈ దేవశయని ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించి ఉపవాసం ఉండడం వలన తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

వైదిక పంచాంగం ప్రకారం చూసినట్లయితే, ఈ ఏడాది ఆషాఢ శుక్ల ఏకాదశి జూలై 25, శనివారం నాడు వచ్చింది. అందువల్ల ఆ రోజు ఏకాదశి ...