భారతదేశం, మార్చి 6 -- పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ వ్యాపార రంగాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా 'సిటీ ఆఫ్ గోల్డ్'గా పేరుగాంచిన దుబాయ్‌లో ప్రస్తుతం ఒక వింత పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, దుబాయ్‌లో మాత్రం భారీ డిస్కౌంట్లకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ఈ పోరు విమాన రాకపోకలను స్తంభింపజేయడమే ఇందుకు ప్రధాన కారణం.

సాధారణంగా దుబాయ్ నుంచి ఆసియా దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు భారీగా బంగారం ఎగుమతి అవుతుంటుంది. అయితే యుద్ధం కారణంగా గగనతలం (Airspace) పాక్షికంగా మూతపడటంతో ఎగుమతులు నిలిచిపోయాయి. విమానాలు రద్దు కావడం, విమాన బీమా (Insurance) ఖర్చులు విపరీతంగా పెరగడంతో వ్యాపారులు బంగారాన్ని బయటకు పంపలేకపోతున్నారు.

బంగారాన్ని నిల్వ ఉంచడం కంటే, డిస్కౌంట్‌కైనా సరే...