భారతదేశం, ఫిబ్రవరి 22 -- సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'ది కేరళ స్టోరీ'కి సీక్వెల్‌గా వస్తున్న 'ది కేరళ స్టోరీ 2' (The Kerala Story 2) విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఒక ముస్లిం కుటుంబం, ఒక అమ్మాయికి బలవంతంగా గొడ్డు మాంసం (బీఫ్) తినిపించే సన్నివేశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొచ్చిలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకకు హాజరైన దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను మీడియా ప్రతినిధులు ఈ సినిమా ట్రైలర్ గురించి ప్రశ్నించగా, ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.

"అదొక చెత్త సినిమా, పక్కా ప్రచార చిత్రం (Propaganda). అంతా అబద్ధం. ఎవరైనా బీఫ్ అలా తినిపిస్తారా...