భారతదేశం, జూలై 17 -- జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకునే లోపే అనూహ్య అడ్డంకులు ఎదురైతే, పెద్దలు దాన్ని 'నజర్' లేదా 'దృష్టి దోషం'గా అభివర్ణిస్తారు. పని పూర్తి కాకుండానే ఆగిపోవడం, కారణం లేకుండానే పిల్లలు ఏడవడం, నిరంతరం అశాంతి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, శాస్త్రబద్ధంగా దిష్టి తీసేసే పద్ధతులు మీకు ఉపశమనం కలిగిస్తాయి.

మన చుట్టూ ఉన్న వ్యక్తుల చూపుల్లో లేదా ఆలోచనల్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మనపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఏ శుభకార్యమైనా, కొత్త వస్తువు కొన్నా అందరికీ చెప్పేయడం వల్ల కూడా ఈ దృష్టి దోషం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పసిపిల్లలకు, వ్యాపారాల్లో ఉన్నవారికి, కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికి ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. అయితే, దీనికి భయపడాల్సిన పనిలేదు, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ నెగటివ్ ఎనర్...