భారతదేశం, మార్చి 30 -- రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు క్షీణించ‌డం కారణంగా ఘోరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని.. రాష్ట్ర ప్రజ‌ల్ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ హెచ్చరించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు క్రమేణా అతి త‌క్కువ‌గా 1.50కు ప‌డిపోవ‌డం, దాని ప‌రిణామాల‌పై మంత్రి తీవ్ర ఆందోళ‌న‌ను వెలిబుచ్చారు. ఈ స‌మ‌స్యను స‌మిష్టిగా ఎదుర్కోడానికి ప్రజ‌లు, మీడియా, ఇత‌ర భాగ‌స్వాములు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి న‌డుం బిగించాల‌ని పిలుపునిచ్చారు.

జ‌నాభా స్థిరీక‌ర‌ణ‌కు సంతానోత్పత్తి రేటు 2.10 అవ‌స‌రం కాగా.. ప‌లు ద‌శాబ్దాలుగా అనుస‌రించిన జ‌నాభా నియంత్రణ విధానంతో ఈ రేటు నేటికి 1.50 శాతానికి ప‌డిపోయింద‌ని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఇక‌నైనా దిద్దుబాటు చ‌ర్యల్ని చేప‌ట్టకుంటే ప్రజ‌లు, రాష్ట్ర ఆర్థిక ప్రగ‌తికి తీవ్ర విఘాతం ఏర్పడ‌నుంద‌ని ...