భారతదేశం, జూన్ 29 -- ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నాయి. దీంతో బడా కంపెనీలు సైతం కొత్త కొత్త ఈవీలను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో భారత్‌లో విడుదలయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి చూద్దాం.. ఇందులో సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో వినియోగదారులకు సుమారు 100 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. అలాంటి మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.

సుజుకి ఇండియా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఇ-యాక్సెస్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. సుజుకి ఇ-యాక్సెస్ త్వరలో అమ్మకానికి రానుంది. ఇందులో 3.07 కిలోవాట్ల సామర్థ్యం గల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 4.1 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో జత అయి ఉంటుంది. ఈ ఇ-స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్...