భారతదేశం, మే 15 -- తెలంగాణలో పొద్దుతిరుగుడు పంటను మార్క్‌ఫేడ్ ద్వారా ప్రభుత్వం సేకరించనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల నుంచి పొద్దుతిరుగుడు పంట మొత్తాన్ని సేకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెంచిన పంట లక్ష్యాలకు ఆమోదం లభించిన తర్వాత కొనుగోళ్లు తిరిగి ప్రారంభమవుతాయని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మొహమాద్ హబీబ్ హామీ ఇచ్చారు. 2025-26 యాసంగి (రబీ) సీజన్ కోసం నిర్దేశించిన 2,39.330 మెట్రిక్ టన్నుల ప్రారంభ సేకరణ లక్ష్యాన్ని పూర్తిగా సాధించినట్లు తెలిపారు. సేకరించిన నిల్వలను మార్గదర్శకాలకు అనుగుణంగా నాఫెడ్, స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు.

సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అందించిన సమాచారం ప్రకారం.. 1,670.28 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేయగా, మొత్తం ఉత్పత్తి 1,169.196 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ఇది ...