భారతదేశం, ఏప్రిల్ 2 -- వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన నెల రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా సైన్యం త్వరలోనే ఇరాన్‌లో తన 'పని పూర్తి చేస్తుంది' అని ఆయన ప్రకటించారు. తమ కీలక వ్యూహాత్మక లక్ష్యాలు దాదాపుగా నెరవేరుతున్నాయని చెబుతూ, ఈ యుద్ధాన్ని ఆయన పూర్తి స్థాయిలో సమర్థించుకున్నారు.

గత కొన్ని వారాలుగా అమెరికా ప్రకటనల్లో స్పష్టత కొరవడటం, తరచూ పరస్పర విరుద్ధమైన సంకేతాలు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా తన సైనిక చర్యలను తగ్గిస్తోందా లేదా మరింత ఉధృతం చేస్తోందా అనే గందరగోళానికి ఆయన తెరదించారు. అయితే, ఇదే సమయంలో ఇరాన్ కూడా ఇజ్రాయెల్, పర్షియన్ గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. అమెరికా వైమానిక దళాలు టెహ్రాన్ నగ...