భారతదేశం, జూలై 24 -- మహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అలాగే పాపాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంతాన సౌభాగ్యం కలుగుతుంది.

గ్రహ దోషాల ప్రభావం నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. అంతేకాదు, విష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. మోక్షప్రాప్తికి మార్గం కూడా లభిస్తుంది. అయితే, రేపు తొలి ఏకాదశి వేళ విష్ణువుని ఆరాధించేటప్పుడు వీటిని కచ్చితంగా గుర్తుపెట్టుకొని పాటించడం మంచిది.

రేపు తొలి ఏకాదశి. దీనిని దేవశయనీ ఏకాదశి లేదా ఆషాఢ శుక్ల ఏకాదశి అని కూడా అంటారు. హరిశయనీ ఏకాదశి అని కూడా దీనికి పేరు. ఈ రోజు విష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మ...