భారతదేశం, ఆగస్టు 25 -- Dhanbad Coimbatore Amrit Bharat Express : తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మంచి శుభవార్త అందించింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్ మధ్య నూతన 'అమృత్ భారత్ వారపు ఎక్స్‌ప్రెస్' (రైలు నంబర్లు 22363/22364) ప్రారంభానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు ధన్‌బాద్ నుంచి ఆగస్టు 22, 2026న, కోయంబత్తూర్ నుంచి ఆగస్టు 25, 2026న ప్రారంభమయ్యాయి.

ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బల్హార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తిరుప్పూర్ వంటి కీలక స్టేషన్ల మీదుగా సాగుతుంది. తెలంగాణ, ఏపీ మీదుగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.

ట్రైన్ నంబర్ 22363 (ధన్‌బాద్ - కోయంబత్తూర్ అ...