భారతదేశం, మే 22 -- IRCTC Divya Dakshin Yatra Package 2026 : దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మక పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం IRCTC సరికొత్త ఆధ్యాత్మిక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం - చిదంబరం' పేరుతో ఒక ప్రత్యేక 'భారత్ గౌరవ్' టూరిస్ట్ రైలును ప్రకటించింది.

ఈ వేసవి కాలంలో పవిత్ర క్షేత్రాలను అత్యంత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో దర్శించుకోవడానికి ఈ యాత్ర అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. ఈ ప్రత్యేక టూరిస్ట్ రైలు మే 24వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మొత్తం 7 రాత్రులు, 8 పగళ్ల పాటు (8 రోజులు) సాగే ఈ యాత్రలో దక్షిణ భారత దేశంలోని ప్రముఖ శైవ, వైష్ణవ మరియు శక్తి పీఠాలకు సంబంధించిన ఏడు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను భక్తులకు చూపిస్తారు.

త...