భారతదేశం, మే 16 -- SCR Charlapalli Tiruchanur Weekly Express : తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు.. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచానూరు మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా సేవలందించిన ఈ సర్వీసును ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆదివారం రాత్రి 21:30 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరి మల్కాజ్‌గిరి (22.15), కాచిగూడ (22.40), షాద్‌నగర్ (23.29) మీదుగా ప్రయాణిస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మహబూబ్‌నగర్ (00.15), వనపర్తి రోడ్ (01.19), గద్వాల్ (01.45) స్టేష...