భారతదేశం, ఆగస్టు 1 -- తెలంగాణ రాష్ట్రంలో టూరిస్ట్ బస్సుల యజమానులకు ఊరటనిస్తూ, రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ రవాణా శాఖ కీలక అడుగులు వేస్తోంది. త్రైమాసిక పన్నులను క్రమబద్ధీకరించడం, పదే పదే పర్మిట్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా టూరిస్ట్ బస్సులు రాష్ట్రమంతటా స్వేచ్ఛగా తిరిగేలా వన్ స్టేట్, వన్ టాక్స్(ఒకే రాష్ట్రం.. ఒకే పన్ను) విధానాన్ని తీసుకొచ్చేందుకు సమగ్ర పరిశీలన జరుపుతోంది. ఈ ప్రతిపాదిత మార్పులపై రవాణా శాఖ కమిషనర్ కె. ఇలంబరితి టూరిస్ట్ బస్సు ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించారు.

ప్రస్తుతం తెలంగాణలో టూరిస్ట్ బస్సులకు మూడు వేర్వేరు త్రైమాసిక పన్ను స్లాబ్‌లు అమల్లో ఉన్నాయి. ఒకే జిల్లా పన్ను సీటుకు త్రైమాసికానికి సుమారు రూ.1,150, రెండు జిల్లాల పన్ను సీటుకు త్రైమాసికానికి సుమారు రూ.1,510, రాష్ట్ర స్థాయ...