భారతదేశం, మార్చి 19 -- సంక్షేమం, అభివృద్ధి, ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. కొత్తగా ఆరు పథకాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. విద్యార్థుల కోసం యంగ్ ఇండియా కిట్స్, బాలికా విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో సహా ఆరు కొత్త పథకాలను కూడా ప్రభుత్వం ప్రకటించనుందని సమాచారం. శుక్రవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే అధికారులతో సమావేశం అయ్యారు. రంగాల వారీ కేటాయింపులు, కొత్త పథకాల ప్రకటన, అంచనాలను ఖరారు చేయడంపై దృష్టి సారించింది.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. కేటాయింపులు, పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక మార్పులు సూచించిన తర్వాత ఈ ప్రతిపాదనలను ఖరారు చేశారు. బడ్జెట్ ప్రతిప...