భారతదేశం, జూన్ 12 -- తెలంగాణలోని నిరుపేద, వెనకబడిన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మూడోవ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పలు విప్లవాత్మక సంస్కరణలకు ఆమోదం తెలిపారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, గురుకుల డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG) స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) కోర్సులను ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. దీనివ...