భారతదేశం, ఫిబ్రవరి 20 -- తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డ్స్‌-2025 ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉగాదికి అవార్డులు ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. అయితే తాజాగా జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటు చేసుకుంది. స్పెషల్‌ అవార్డ్స్‌ జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజని ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఛైర్మన్‌గా ఉన్న సీనియర్ డైరెక్టర్ రాఘ‌వేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డిని నామినేట్ చేసింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో ప్రదానం చేస్తున్న సినిమా అవార్డులలోని వివిధ విభాగాలకు ఇప్పటికే జ్యూరీలను నియమించింది. అందులో 2025 సినిమా అవార్డుల ఎంపిక కోసం వేసిన కమిటీకి జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఉన్నారు. గత రెం...