భారతదేశం, ఆగస్టు 9 -- తెలంగాణ రాష్ట్రంలోని ఐటీఐ (ITI) కళాశాలల్లో 2026-2027 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండో దశ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేశారు. మొదటి దశలో సీటు పొంది చేరిన విద్యార్థులు కూడా మెరుగైన ఆప్షన్లు లేదా ట్రేడ్‌ల కోసం స్లైడింగ్ విధానం ద్వారా ఈ రెండో దశలో కొత్త వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ గుర్తింపుతో సీటీఎస్ పరిధిలోని మొత్తం 47 రకాల ట్రేడుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, 63 ప్రభుత్వ ఐటీఐలు, 230 ప్రైవేట్ ఐటీఐలలో ఈ ప్రవేశాలు కల్పిస్తున్నారు.

ఏటీసీలలో 6 రకాల అధునాతన కోర్సులు, సాధారణ ఐటీఐలలో 41 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ టె...