భారతదేశం, మే 18 -- Telangana Activists Recognition Committee : స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ అధికారికంగా ఊపందుకుంది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తన తొలి సమావేశాన్ని నిర్వహించింది. కమిటీ చైర్మన్ కె. కేశవరావు నేతృత్వంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల చిరకాల ఆకాంక్షను గుర్తిస్తూ.. ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఉద్యమకారుల గుర్తింపు ...