భారతదేశం, జూలై 28 -- హైదరాబాద్-విజయవాడ మధ్య ఎక్కువగా ప్రయాణం చేసేవారికి టీజీఎస్ఆర్టీసీ మంచి వార్త చెప్పింది. అది ఏంటంటే.. ఈ రూట్లలో నడిచే బస్సుల్లో టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. కనీసం 16 శాతం నుంచి గరష్టంగా 30 శాతం వరకు ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలంగాణ ఆర్టీసీ తెలిపింది.
ఈ తగ్గింపుల ఆఫర్ చూసుకుంటే.. గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరపై 30 శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం స్పెషల్ ఆఫర్ ఉంటుంది. అంతేకాదు సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16 శాతం మేరకు తగ్గిస్తున్నట్టుగా టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ స్పెషల్ ఆఫర్లు ఆన్లైన్, ఆఫ్లైన్కు వర్తిస్తాయి. టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం కింద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.