భారతదేశం, జూన్ 29 -- Telangana Rythu Bharosa Updates : రైతు భరోసా నిధులు విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి సీజన్‌కు ఎకరానికి రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. ఈ వానాకాలం సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని జూన్ 30వ తేదీన ప్రభుత్వం విడుదల చేయనుంది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, మత్కేపల్లి గ్రామం వద్ద జూన్ 30వ తేదీన (మంగళవారం) ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈ ప్రతిష్టాత్మక సభా వేదిక నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి బటన్ నొక్కి ఒకేసారి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ భారీ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే దాదాప...